లండన్: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఓ తాగుబోతు అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీనికి సోషల్ మీడియా వేదికగా రవిశాస్త్రి పోస్టు చేసిన వీడియోనే కారణం. ఓ ఎనర్జీ డ్రింక్ను ప్రమోట్ చేసేందుకు ఓ వీడియోను రవిశాస్త్రి తన ట్విటర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. ‘ఈ రోజు లండన్లో చాలా వేడిగా ఉంది. ఈ డ్రింక్ తాగి వేడి నుంచి ఉపశమనం పొందండి’ అంటూ పేర్కొన్నాడు. ఇది అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. లార్డ్స్ టెస్టులో ఎలా గెలవాలన్న దానిపై జట్టుకు సలహాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నావని, తమంతా భారత విజయం కోసం ఎదురు చూస్తున్నామని ఒకరు మండిపడగా.. అసలు నువ్వు కోచ్వేనా అని ఇంకొకరు ప్రశ్నించారు. కోచ్గా రవిశాస్త్రి జట్టు కోసం ఏం చేస్తున్నాడని మొన్న మ్యాచ్ జరిగే సమయంలో నిద్రపోతూ కనిపించాడని.. ఇప్పుడేమో ఇలా ప్రమోషనల్స్ అంటూ తిరుగుతున్నాడని మండి పడ్డారు. ( రవిశాస్త్రి.. ఆంధ్ర భోజనం ఫుల్గా తింటే?)
ఇంగ్లండ్ పర్యనలో ఉన్న కోహ్లి సేన తొలి టెస్టు ఓడిన విషయం తెలిసిందే. 5 టెస్టు మ్యాచ్లో భాగంగా రెండో టెస్టు రేపు లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది. ఇక ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రవిశాస్త్రి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. అతన్ని మార్నింగ్ ఎవరూ ఇంటర్వ్యూ చేయలేరని, ఎందుకంటే అతనేం మాట్లాడుతాడో అతనికే తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
First go and give some match wining tips to cricketers we are all need india victory not ur life story i think im not see in the not in one time in the practice r u definetly coach ha
— Manoj HN Manu (@IamManojHN101) August 6, 2018